బంగారు ప్రమిదః గోధుమలపై ఉంచి చుట్టూ ఎరుపు రంగు పూలు అలంకరించి, ఆవు నెయ్యితో తూర్పు ముఖంగా వెలిగించాలి. ధనసమృద్ధి, విశష బుద్ధి చాతుర్యం లభిస్తుంది.
వెండి ప్రమిదః బియ్యంపై ఉంచి తెలుపు రంగు పూలతో అలంకరించి, ఆవునెయ్యితో తూర్పు ముఖంగా వెలిగిస్తే ధనసంపద వృద్ధి చెందుతుంది.
రాగి ప్రమిదః ఎర్రని కందిపప్పుపై ఉంచి ఎరుపు రంగు పూలతో అలంకరించి, నువ్వుల నూనెతో దక్షిణాభిముఖంగా వెలిగిస్తే మనోబలం కలుగుతుంది, అనిష్టనాశనం.
కంచు ప్రమిదః దీనిని శనగపప్పుపై పెట్టి చుట్టూ పసుపురంగు పూలతో అలంకరించి, ఉత్తరాభిముఖంగా నువ్వుల నూనెతో వెలిగిస్తే ధనానిని స్థిరత్వం ఉంటుంది.
మట్టిప్రమిదః ఆవు నెయ్యితో తులసి మొక్క వద్ద వెలిగించాలి. దుష్టశక్తుల నాశనం, పాపహరణం.
పిండి ప్రమిదః పిండితో నలుచదరపు దీపం వెలిగిస్తే నాలుగువిధాలా లాభం కలుగుతుంది.
- అమావాస్య రాత్రి ఆవు నేతితో రావిచెట్టు కింద దీపం పెడితే పితృదేవతలు సంతోషిస్తారు.
- ఆవనూనెతో రావిచెట్టు క్రింద నలభై ఒక్క రోజులు దీపం వెలిగిస్తే కోరిక కోరిక నెరవేరుతుంది.
- నువ్వుల నూనెతో నలభై ఒక్కరోజులు దీపం వెలిగిస్తే సమస్త రోగాలు తొలగుతాయి.
- గురువారం నాడు అరటిచెట్టు దగ్గర ఆవునేతితో దీపం వెలిగిస్తే అవివాహితులకు శీఘ్రమే వివాహ ప్రాప్తి కలుగుతుంది.
దీపం వెలిగించడంలో అంతరార్థమేమిటి? | Significance of Lighting oil lamps in Telugu