ప్రతీ ప్రాణికి మరణం ఉంటుందా?

1
13895

 

2000px-The_death.svg_

జాతస్యహి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ
తస్మాదపరిహార్యేర్దే నత్వం శోచితు మర్హసి !! — 2-27- భగవద్గీతా

పుట్టినవానికి మరణము తప్పదు. మరణించినవానికి పుట్టుట తప్పదు.
నిత్య సత్యం అయిన , నిస్సంశం అయిన ఈ విధి విధానం గురించి శోకించుట తగదు. అని భగవద్గీత చెబుతోంది .

మరణం లేకపోతే బాల్యం తెలియకుండా గడిచిపోతుంది , యవ్వనం సుఖ భోగములతో గడిచిపోతుంది . చివరికి వార్ధక్యం కూడా భయంకరమైనది. మేదస్సు , శరీరం రెండూ బలహీనం అవుతాయి . వార్ధక్యం లో ఈసడింపులు తో బ్రతుకు భారము అవుతుంది . ఇలా జీవి పరిణామ క్రమం లో ముగింపు వైపు చూసే స్థితి ఏర్పడుతుంది . అందుకే మరణం అనేది ఒకటి భగవంతుడు పెట్టాడు . ఆయన కొద్ది మందిని అర్దాంతరంగా తీసుకొని వెళ్ళుతూ ఉన్నాడు అంటే కారణం వ్యక్తి యొక్క ఋణం భూమి మీద తీరింది అని అర్ధం చేసుకోవాలి .

మరణం జన్మ ధర్మం .
మరణం మనిషికి మిత్రుడు, జీవితమే శత్రువు .
అసతో మా సద్గమయ !
తమసోమా జ్యోతిర్గమయ !
మృత్యోర్మా అమృతంగమయ!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here