
Gayatri Jayanthi 2023
1గాయత్రీ జయంతి కథ (Story of Gayatri Jayanti)
వేదమాత గాయత్రీదేవి మంత్రాన్ని బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ప్రవచించిన రోజు కనుక ఈ రోజుని గాయత్రీ జయంతి గా పేర్కొంటారు. జ్యేష్ట శుక్ల ఏకాదశినాడు హిందువులు గాయత్రీ జయంతిని ఘనంగా జరుపుతారు. ఉపనయనం అయినవారు ఈ రోజున గాయత్రీ మంత్రాన్ని తప్పనిసరిగా జపిస్తారు. ఈ రోజున గాయత్రీ మాతను పూజించడం వలన నూరు జన్మల తపః ఫలం లభిస్తుంది. కోరిన కోరికలు నెరవేరి శత్రుబాధలనుండీ, గ్రహాపీడల నుండీ రక్షింపబడతారు.