
Gayetri Mantra In Telugu
గాయత్రీ మంత్రంలోని 24 బీజాక్షరాలలో 24 దేవతలున్నారన్నది మన పెద్దలమాట. గాయత్రీమంత్రం పరబ్రహ్మ స్వరూపం. మోక్షపదాన్ని ఇస్తుంది. అందుకే గాయత్రీమంత్రానికి అంతటి ప్రాముఖ్యత.
ఓం భూర్భవస్సువ: తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోన: ప్రచోదయాత్
గాయత్రీమంత్రం 24 అక్షరాలలో –
1. “తత్” – గణేశుడు ,
2. “స” – నృసిం హస్వామి,
3. “వి” – విష్ణు,
4. “తు” – ఈశ్వరుడు,
5. “వ” – శ్రీకృష్ణ,
6. “రే” – రాధాదేవి,
7. “ణి” – లక్ష్మీదేవి,
8. “యం” – అగ్నిదేవుడు,
9. “భ” – ఇంద్రుడు,
10. “గో” – సరస్వతీదేవి,
11. “దే” – దుర్గాదేవి,
12. “వ” – హనుమాన్,
13. “స్య” – భూదేవి,
14. “ధీ” – సూర్యభగవానుడు,
15. “మ” – శ్రీరామచంద్రుడు,
16. “హి” – సీతాదేవి,
17. “ధి” – చంద్రుడు,
18. “యో” – యమధర్మరాజు,
19. “యో” – బ్రహ్మదేవుడు,
20. “న:” – వరుణదేవుడు,
21. “ప్ర” – నారాయణుడు,
22. “చో” – హయగ్రీవుడు,
23. “ద” – హంసదేవత,
24. “యత్” – తులసీమాత.
ఇందులో ఎవరి ఇష్టదేవతను వారు ఆ దేవత గాయత్రీ మంత్రంతో జపించి ఆ దేవతా అనుగ్రహాన్ని పొందవచ్చు. ఉదయం 108 సార్లు, సాయంత్రం 108 సార్లు చొప్పున 40 రోజులపాటు ఆ దేవతాచిత్రం ముందు కూర్చుని ధూప, నైవేద్యాలతో పూజించి, ఆ దేవత మంత్రాలను 108 సార్లు జపించితే అనుకున్న కోరికలు నెరవేతురాయి.