
వినసొంపైన స్వరాన్ని పొందాలంటే..? | How to Get Beautiful Voice
వినసొంపైన స్వరం కావాలని కోరుకోని వారుండరు. గొంతు సమస్యలు తీరడానికీ, గంభీరమైన, సుస్వరమైన కంఠాన్ని పొందటానికి సహజమైన సంప్రదాయబద్ధమైన పరిష్కారం శంఖముద్ర .
శంఖ ధ్వానం తో భగవంతుని ఎలా మేల్కొలుపుతామో అదేవిధంగా శరీరమనే దేవాలయం లో దైవత్వాన్ని మేల్కొపేది శంఖముద్ర. శంఖ ముద్ర ద్వారా ఆందోళనలు తగ్గి మనసుకు ప్రశాంతత కలుగుతుంది.
1. శంఖ ముద్ర ఎలా వేయాలి.
- సుఖాసనంలో గానీ పద్మాసనంలో గానీ లేక వజ్రాసనంలో గానీ వెన్ని నిటారుగా ఉంచి కూర్చోవాలి.
- కుడిచేతి నాలుగు వేళ్ళతో పటం లో చూపించిన విధంగా ఎడమచేతి బొటనవేలిని చుట్టి ఉంచాలి.
- కుడిచేతి బొటన వేలిని ఎడమచేతి మధ్య వేలిని తాకేలా ఉంచాలి.
- కుడిచేతి వేళ్ళ మధ్యలో ఉన్న బొటనవేలిని ముత్యం లా భావించాలి.
- ఎడమ చేతి మధ్యవెలుని తాకుతున్నా కుడి బొటన వేలిని మీలోని ఉన్నతమైన శక్తిగా భావించాలి.
- ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నాభి స్థానం నుంచీ ధ్వనించేలా ఓం కారాన్ని నెమ్మదిగా దీర్ఘంగా జపించాలి.
- శ్వాసకూడా దీర్ఘంగా ఉండేలా చూసుకోవాలి.
- గొంతు సమస్యలకు నివారణ కోసం కానీ, శ్రావ్యమైన గొంతును పొందాలనుకునేవారు కానీ ఈ ముద్రను రోజుకు మూడు సార్లు సాధన చేయాలి.
- కనీసం పదిహేను నిముషాలపాటు శంఖ ముద్రను సాధన చేయడం ద్వారా పూర్తి లాభాలను పొందుతారు.
Promoted Content
