Who narrated the Vishnu Sahasranamam to whom? Who are the participants in this divine speech?
If Bhishma was saying the Vishnu Sahasranama, none of the Dharmarajas wrote it down and how did it get popular and reach us?
విష్ణుసహస్రనామాల్ని భీష్ముడు చెప్తుంటే ధర్మరాజాదులు ఎవరూ రాసుకోలేదు. వారు కేవలం శ్రద్ధగా విన్నారు, అంతే. అలాంటప్పుడు విష్ణుసహస్రనామస్తోత్రం ఎలా ప్రచారం పొంది మనవరకూ అందింది?
1940 ప్రాంతంలో కంచి పరమాచార్య స్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తూ ఈ ప్రశ్నే అడిగాడు. అప్పుడు స్వామి వారు సమాధానం ఇలా చెప్పారు –
భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుణ్ణి స్తుతిస్తున్నపుడు పాండవులూ, వ్యాసుడూ మొదలైనవారు శ్రద్ధగా విన్నారు కానీ, ఎవరూ రాసుకోలేదు. అప్పుడు యుధిష్ఠిరుడు కృష్ణునితో “ఈ వేయినామాలు మనమంతా విన్నాం. కానీ రాసుకోలేదు. మళ్లీ ఈ నామాలను మనం పారాయణం చేయాలంటే ఎలా! ఆ సహస్రనామాలు మనందరికీ కావాలి, కనుక ఏం చేయాలి?” అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు – ‘ఆ సహస్రనామాలు మళ్లీ మనకు కావాలంటే వాటిని వ్యాసుడు, సహదేవుడే చెప్పాలి’ అన్నాడు.
అప్పుడు అక్కడివారందరూ ‘అదెలా!?” అన్నారు. అపుడు కృష్ణుడు ఇలా చెప్పాడు – ‘మనందరిలో సహదేవుడు ఒక్కడే సూతస్ఫటికం వేసుకున్నాడు. ఆ స్ఫటికం మహేశ్వర స్వరూపం. దాని ప్రత్యేకత ఏమిటంటే వాతావరణంలోని శబ్దతరంగాలను గ్రహించి తనలో దాచుకుంటుంది” అన్నాడు. కృష్ణుడు సహదేవుని విష్ణు సహస్రనామాలను అందించమని అడిగాడు. శ్రీకృష్ణుని ఆజ్ఞమేరకు, సహస్ర నామ శబ్ద తరంగాలు వచ్చిన చోట- అనగా- భీష్మునికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసుడు కూర్చొని, ఆ సహస్ర నామ శబ్దతరంగాలు పునఃప్రసారం (రీప్లే) అవుతుంటే వ్యాస మహర్షి గ్రంథస్థం చేశాడు. సహదేవుని ద్వారా విష్ణు సహస్ర నామాలు పరంపరగా మన వరకూ అందాయి.
Related Posts:
శ్లోకాలతో శనిదోష నివారణ చేసే ఉపాయం – Remedies for Shani Dosha