
Bharat Gaurav Tourist Train Details
1భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు విశేషాలు
పుణ్యక్షేత్రాలకు వెళ్ళే హిందువులకు శుభవార్త. మే 27న మరోకసారి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు బయల్దేరనుంది. ఈ యాత్రలో పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్లను సందర్శించుకోవచ్చు. ఈ యాత్ర విశేషాలు తెలుసుకుందాం.
ఐఆర్సీటీసీ టూరిజం మార్చి నెలలో సికింద్రాబాద్ రైల్ నిలయం నుంచి తొలి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు (భరత్ ఘౌరవ్ టౌరిస్త్ ట్రైన్)ను ప్రారంభించింది. ఈ పర్యటనకు మంచి ఆదరణ వచ్చింది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు నాలుగు సార్లు పర్యాటకులకు సేవలందించింది. అందుకే ఈ సారి కూడ మే 27న మళ్ళీ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో పుణ్య క్షేత్ర యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ ప్యాకేజిని బుక్ చేసుకున్న వారు పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్లోని ఆధ్యాత్మిక క్షేత్రాలను 8 రాత్రులు, 9 రోజులలో తిరగవచ్చు. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న వారు సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, పెందుర్తి, విజయనగరం రైల్వే స్టేషన్లలో ఈ రైలును ఎక్కొచ్చు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.