కలియుగాంతానికి ఇదే గుర్తు | Maharashtra Kedareshwar Temple

0
219
Maharashtra Kedareshwar Temple Secretes
Maharashtra Kedareshwar Temple Details and History

Maharashtra Kedareshwar Temple Secretes

1కేదారేశ్వర గుహ రహస్యం ఏమిటి ?

కేదారేశ్వర గుహ మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో ఉంది. హరిశ్చంద్ర కోటకు కుడి వైపున ఉంటుంది. ఇది అద్భుతమైన నిర్మాణం. కేదారేశ్వర్ యొక్క 12 అడుగుల శివలింగం ఒక పెద్ద బండరాయి క్రింద ప్రతిష్టించబడింది. ఈ గుహ లోపల ఒక గది కూడా ఉంది. ఇక్కడ 4-6 మంది భక్తులు కూర్చుని పూజ మరియు ధ్యానం చేయవచ్చు. కేదారేశ్వర గుహ ఉన్న శివలింగాన్ని భూమి నుండి 6 అడుగుల ఎత్తులో నిర్మించారు. యుగాంతం అనే పదం ఆధారంగా అనేక కథలు, నవలలు మరియు చివరికి సినిమాలు వచ్చాయి. ఇక పరిశోధనలకు లెక్కే లేదు. ధర్మ, వైదిక దేశంగా పేరొందిన భారతదేశం ఈ యుగానికి సంబంధించిన పరిశోధనలకు లెక్కలేదు. యుగాంతం అని పిలువబడే ఈ ప్రక్రియ లయకారకుడు పరమేశ్వరుని ఆదేశానుసారం జరుగుతుందని పండితులు చెబుతారు.

కలియుగం ముగిసిన తర్వాత ఈ భూమిపై జీవం ఉండదని కొన్ని పురాణాలలో చెప్పబడింది. భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా కలియుగానికి సంబంధించిన కథలు మరియు పరిశోధనలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కాబట్టి భారతదేశంలో కలియుగాన్ని 24 గంటలు చెప్పే గుహ ఉంది. అక్కడికి చేరుకుంటే యుగాంతం గురించి ముందే తెలిసిపోతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన కథనం మీ కోసం.

మనం ప్రస్తుతం కలియుగంలో జీవిస్తున్నాం. భారతీయ పురాణాలు కాకుండా, ఇతర దేశాలలో చాలా మంది ప్రజలు ఈ యుగాంతం తర్వాత మొత్తం ప్రపంచం అంతం అవుతుందని నమ్ముతారు. దీనిపై శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. భారతీయ పురాణాల ప్రకారం, ఈ ప్రపంచం మొత్తం కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగంగా విభజించబడింది. ఒక్కో యుగం తర్వాత భయంకరమైన ప్రళయం వస్తుందని, తదుపరి యుగం ప్రారంభమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా దేవాలయాల్లోనే జరుగుతాయి. మహారాష్ట్రలో అలాంటి దేవాలయం ఉంది. అదే కేదారేశ్వర దేవాలయం. ఇది ఒక గుహ.

మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back