
- ఒక టీస్పూన్ అతి మధుర చూర్ణాన్ని ఒక టీస్పూన్ తేనె లేదా ఒక టీస్పూన్ పంచదారతో కలిపి తింటే కఫం పడిపోయి దగ్గు తగ్గుతుంది.
- అరగ్రాము మిరియాల చూర్ణం, నెయ్యి, చక్కెర, తేనె కలిపి తింటే చాలా మంచిది.
- ఖర్జూరం, మిరియాలు, విడంగాలు, పిప్పళ్లు, తేనె సమభాగాలుగా కలిపి తీసుకోవాలి.
- పిప్పళ్లు, అల్లం, తుంగముస్తలు, పసుపు, కరక్కాయి సమభాగాలుగా తీసుకొని చూర్ణం చేయాలి. దానికి తేనె లేదా పంచదార కలిపి పేస్టు చేసి తినాలి.
- ఉసిరికాయలను పాలల్లో ఉడికించి ఎండబెట్టి పొడి చేయాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యిలో కలిపి తినాలి.
- ఒక టీ స్పూన్ అల్లం రసంలో సమంగా తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. కఫం కరిగిపోతుంది.
- 25 గ్రాముల చెరకు రసంలో 25 గ్రాముల నెయ్యి కలిపి, నెయ్యి మిగిలే వరకు ఉడికించి ఆ నెయ్యిని తాగితే క్షయతో వచ్చిన కాసవ్యాధి తగ్గుతుంది.
- తామర గింజల చూర్ణానికి తేనె కలిపి తీసుకుంటే పైత్య దోషం వల్ల వచ్చిన దగ్గు పోతుంది.
- తమలపాకుల రసాన్ని వెచ్చబెట్టి చల్లారిన తర్వాత సమంగా తేనెకలిపి తాగితే గడ్డ కట్టిన కఫం కరిగి దగ్గు తగ్గిపోతుంది.
- ఒక టేబుల్ స్పూన్ తెల్ల తులసి ఆకుల రసానికి సమపాళ్లలో తేనె కలిపి వాడితే కఫ ప్రకోపం వల్ల కలిగిన దగ్గు తగ్గుతుంది.
- మిరియాల చూర్ణం, నెయ్యి, చక్కెర కలిపి ఒక టీ స్పూన్ చొప్పున తింటే కాస వ్యాధి తగ్గుతుంది.
- రెండు చిటికెల లవంగాల చూర్ణం, తేనె, పటిక బెల్లం చూర్ణంలో కలిపి తింటే దగ్గు తగ్గిపోతుంది.
- రెండు చిటికెల కవిరి చూర్ణాన్ని పెరుగు మీద ఉండే నీటితో కలిపి తాగితే దగ్గు తగ్గుతుంది.
- ఒక తానికాయ చూర్ణాన్ని చెంచాడు తేనెతో కలిపి తిన్నా దగ్గు తగ్గుతుంది.
- ఒక చెంచాడు మునగ చెట్టు వేళ్ల రసానికి సమంగా నువ్వుల నూనె, తేనె కలిపి తాగిస్తే ఆశించిన ఫలితం ఉంటుంది.
తేనె, తులసి ఆకురసం తీసుకుంటే.. దగ్గు, శ్లేష్మం తగ్గుతుంది.