
సాయి బోధ / Sai Baba Bodha
సద్గురువైన సాయినాథుని కథలు అమూల్యమైనవి. ఆయన తన భక్తులకెప్పుడూ గురుభక్తిని గురించీ సన్మార్గమును గురించీ బోధించేవారు. సాయీ సచ్చరిత్రలోని 18-19 వ అధ్యాయాలలో రాధాబాయి అనే ఒక ముసలమ్మకు బాబా తన కథను వివరించే ఘట్టం సదాస్మరణీయమైనది.
1. శ్రీమతి రాధాబాయి దేశముఖ్
రాధాబాయి యను యొక ముసలమ్మ యుండెను. అమె ఖాశాబా దేశ్ముఖ్గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని అమె సంగమనేరు గ్రామప్రజలతో కలసి శిరిడీ వచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తిచెందెను. అమె బాబాను గాఢముగా ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసికొని యేదైన యుపదేశమును పొందవలెనని మనోనిశ్చయము చేసికొనెను. అమె కింకేమియు తెలియుకుండెను. బాబా యామే సంకల్పమును అమోదించక తనకు మంత్రోపదేశము చేయనిచో నుపవాసముండి చచ్చెదనని మనోనిశ్చయము చేసికొనెను. అమె తన బసలోనే యుండి భోజనము, నీరు మానివేసెను.
Promoted Content