
Reasons for Devotees’ Troubles in Simhachalam Chandanotsavam 2023
1సింహాచలం చందనోత్సవంలో భక్తుల ఇబ్బందులకు కారణాలు
సింహాచల పుణ్యక్షేత్రం నిన్న భక్తులతో కిటకిటలాడింది. చందనోత్సవంలో భాగంగా అప్పన్న నిజరూప దర్శనం కోసం భారీగా తరలి వచ్చిన భక్తులు. ఎందుకంటే సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే స్వామి వారు నిజరూపంలో దర్శనం ఇస్తారు. అందువల్ల భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కానీ భక్తుల పరిస్థితి చాలా దయణీయంగా మారింది. ఎందుకు? అసలు ఏం జరిగింది?!
ప్రతి యేడాది జరిగే సింహాచల వరాహ నరసింహ స్వామి చందనోత్సవంలో భాగంగా స్వామి వారి నిజరూప దర్శనం కోసం భక్తులు వేయిల సంఖ్యలో తరలి వచ్చారు. కాని వారికి దర్శనం జరగక ఇబ్బంది పడ్డారు. తోపులాటలు, గొడవలూ జరిగాయి. ఆలయ అధికారులు సామాన్య భక్తులకు ఇబ్బందులు పెడుతూ వీఐపీలకు ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల గంటల తరబడి క్యూలో ఉన్న సాధారణ భక్తులు తీవ్ర ఆటంకం జరిగింది. భక్తులు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.