
1. కదిరి నృసింహుని వైభవం
నవనారసింహ క్షేత్రాలలో ఒకటైన కదిరి లక్ష్మీనరసింహుని ఆలయం ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉన్న దివ్యక్షేత్రం. కదిరినే ఖాద్రి అనికూడా అంటారు. కులమత భేదాలు లేకుండా అన్ని మతాలవారూ, అన్ని కులాలవారూ స్వామివారి బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం ఇక్కడి విశేషం. ఖదిర అంటే చండ్ర చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి కదిరి అన్న పేరు వచ్చింది. ఈ కదిరి నృసింహ క్షేత్రం అనంతపురం జిల్లాలో ఉంది. కదిరి నృసింహ క్షేత్రం హైదరాబాదుకు దాదాపుగా 500 కిలోమీటర్ల దూరం లో ఉంటుంది. ఇక్కడికి చిత్తూరు, గుంతకల్లు మరియు అనంతపురం మీదుగా బస్సు, మరియు రైలు సౌకర్యాలుకూడా ఉన్నాయి. దగ్గరలో పుట్టపర్తి విమానాశ్రయం కూడా కలదు.
Promoted Content