
2. కదిరి లక్ష్మీ నృసింహస్వామి ఆలయం ఎప్పటిది? ఎలా ఉంటుంది?
కదిరి ఆలయం 13 వ శతాబ్దం లో నిర్మింపబడినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆలయం ఎంతో విశాలంగా, ఎత్తైన ప్రహారీ గోడ తో అద్భుతమైన శిల్పకళ తో విరాజిల్లుతుంది. ఆలయానికి నలువైపుల గోపురాలు ఉంటాయి. ప్రధాన ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, ప్రదిక్షిణా పథం, ముఖ మంటపం, అర్థ మంటపం, రంగమంటపం ఉన్నాయి. ఇక్కడున్న ప్రధానమైన కోనేరును భృగు తీర్థం అంటారు. భృగు తీర్థం మాత్రమే కాకుండా ఇక్కడ ద్రౌపది తీర్థము, కుంతి తీర్ఠము, పాండవ తీర్థము, వ్యాస తీర్థము మొదలైన తీర్థాలు ఉండేవి. ఇక్కడి స్వామివారు అమ్మతల్లి, తాయారు, ప్రహ్లాదులతో కలిసి దర్శనిమిస్తారు.
Promoted Content