
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS
అతిథులు ఇంటికి వస్తే ఎప్పుడు వెళతారా అని ఎదురు చూసే రోజులివి. కానీ ఒకానొక కాలం లో అతిథి సేవ చేసే భాగ్యం కలగడం గొప్ప అదృష్టంగా భావించే వారు. అతిథి దేవో భవ అన్న మాటను త్రికరణ శుద్ధిగా నమ్మేవారు. అటువంటి ఆదర్శవంతమైన కథ ఒకటి తెలుసుకుందాం.
1. కుశిక మహారాజు ఆతిథ్యం
త్రేతా యుగం లో కుశికుడు అనే మహారాజు ఉండేవాడు. ఆయన ధర్మవర్తనుడిగా పేరుగాంచినవాడు. ఆయన భార్య కూడా భర్తకు తగిన ఇల్లాలు. ప్రజలను కన్న బిడ్డలవలే, మహర్షులను దేవతల వలె పూజించేవారు. వారి సద్గుణాలను, ముఖ్యంగా అతిథి మర్యాదలను చ్యవన మహర్షి పరీక్షించదలచాడు. వజ్రం కాంతిని ప్రసరించాలన్నా, గొప్పవారి సుగుణాలు ప్రపంచానికి చాటాలన్నా పరీక్షలు తప్పవు కదా..! అందుకని చ్యవన మహర్షి భార్యా సమేతుడై కుశిక మహారాజు వద్దకు వెళ్ళాడు. రాజు ఆ ముని దంపతులను ఘనంగా స్వాగతించాడు. చ్యవనుడు ‘ రాజా మేము నీ ఇంట అతిథులమై కొద్ది రోజులు విశ్రాంతి తీసుకొన దలచినాము.’ అన్నాడు. కుశికుడు పరమానంద భరితుడైనాడు. ముని దంపతులే స్వయంగా తన ఇంటికి వచ్చి ఉంటాము అనడంతో ఆ రాజ దంపతుల ఆనందానికి హద్దులు లేవు. ఆనందంగా వారికి సపర్యలు చేయడానికి కుశికుడూ అతని భార్యా ఉపక్రమించారు.