మనం భగవంతునికి నైవేద్యం పెట్టడానికి రకరకాల వంటలు చేస్తాం. భగవంతుడు సర్వవ్యాపకుడని అంగీకరిస్తాం. కానీ ఆకలంటూ ఎవరైనా వచ్చినప్పుడు అన్ని జీవులలోనూ ఉన్న భగవంతుని గుర్తించము. ఆ కనువిప్పు కలిగించే చక్కని కథ తెలుసుకుందాం.
1. యాగం
పూర్వ కాలం లో మహర్షుల ఆశ్రమాలలో నిత్యం లోక క్షేమం కోసం యజ్ఞ యాగాదులు జరిగేవి. ఒకనాడు ఆశ్రమం లో వాయుదేవుని కొరకు యాగం జరిగింది. అక్కడి ఋషులు యాగం పూర్తి చేసి యాగఫలాన్ని భుజించడానికి సన్నద్ధం అవుతున్నారు. అదే సమయం లో ఒక బ్రహ్మచారి అక్కడకు వచ్చి భిక్షను అర్థించాడు. వారు తినగా మిగిలిన దానిని తనకు భిక్షగా ఇవ్వమని అడిగాడు. కానీ ఋషులు అతనికి భిక్షను ఇవ్వడానికి నిరాకరించారు.
Nice story