
Hindu temple entrance ritual
1. ఆలయ ముఖద్వారపు గడపను ఎందుకు నమస్కరిస్తారు?
ఆలయ ప్రవేశద్వారానికి ముందు గర్భగుడిలోకి వెళ్లే దారిలో రాయితో తయారు చేసిన ఒక గడప ఉంటుంది. ప్రతి భక్తుడు ఆ గడపకు నమస్కరిస్తూ, వినయపూర్వకంగా దాటి వెళ్తాడు. అయితే, ఎందుకు నమస్కరిస్తామో చాలా మందికి తెలియకపోవచ్చు. ఇది కేవలం ఆచారం కాదుగాక, దానికి శాస్త్రపరమైన, ధార్మికంగా గాఢమైన ప్రాముఖ్యత ఉంది.
రాయితో తయారు చేసిన గడప ఎందుకు?
గృహాల గడపలు సాధారణంగా చెక్కతో తయారు చేస్తారు. అయితే ఆలయాల్లో మాత్రం గడపలు రాయితో తయారు చేస్తారు. ఎందుకంటే — పర్వతాలు స్వయంగా భక్తుల అవతారాలుగా భావించబడతాయి. ఉదాహరణకు:
-
భద్రుడు అనే ఋషి → భద్రగిరి పర్వతం
-
హిమవంతుడు అనే భక్తుడు → హిమాలయాలు
-
నారాయణుడు అనే భక్తుడు → నారాయణాద్రి
ఈ భక్తుల పర్వతరూపాలపై స్వయంగా భగవంతుడు ప్రతిష్టించబడ్డాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆలయ నిర్మాణంలో ఆయా పవిత్ర పర్వతాల రాళ్లను తీసుకుని, గర్భగుడి వద్ద గడపగా ఏర్పాటు చేస్తారు.
గడపకు నమస్కారం ఎందుకు?
ఆ గడప రాయి, నిత్యం భగవంతుడిని దర్శిస్తూ పుణ్యాన్ని సంపాదించింది. అలాంటి పవిత్ర రాయిని తొక్కుతున్నందుకు మనం వినయంతో నమస్కరించి, “క్షమించు స్వామి!” అని మనస్పూర్తిగా ప్రార్థిస్తూ ఆ గడపను దాటి ఆలయంలోకి ప్రవేశిస్తాము. ఇది ఒక భక్తి చిహ్నం మాత్రమే కాదు, దైవ భావనతో నిండిన వినయం కూడా.
ఆధ్యాత్మిక పండితుల సూచన ప్రకారం, ఆ గడపను తొక్కకుండా, వాలుతూ దాటి పోవడం ఉత్తమం. ఇది దైవానుగ్రహాన్ని పొందేందుకు సూచించిన ఒక పాతకాలపు పరిపాటిగా భావించవచ్చు.
Related Stories:
It’s good