
Facts About Ganesh Nimajjanam
1వినాయకుడిని నిమజ్జనం ఎందుకు చేస్తారు?
భాద్రపద మాసంలో ప్రకృతి అంత పచ్చదనంతో నిండిపోయి కనిపిస్తుంది. వేసవి కాలం పోయి, బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో ప్రాణశక్తిని పుంజుకుని పచ్చదనాన్ని వెదజల్లుతుంది. నదులలో నీరు నిండి తొనసలాడుతుంటాయి. గణపతి జన్మ నక్షత్రం అయిన బుధగ్రహానికి ఆకుపచ్చనివంటే చాల ఇష్టం. గణపతికి కూడా గడ్డిజాతి మొక్కలంటే చాలా ఇష్టం. అందుకే గణపతికి 21 గడ్డి జాతి మొక్కలను సమర్పించి పూజలు చేస్తారు. ఒండ్రుమట్టితో చేసిన వినాయకుని ప్రతిమను మాత్రమే గణేష్ పూజకు ఉపయోగించడంలో ఒక విశేషముంది. అందుకు కారణం జలాశయాలన్నీ పూడికతో నిండి ఉంటాయి. బంకమట్టి కోసం జలాశయాలలో దిగి మట్టిని తీయడం వల్ల జలాశయంలో నీళ్లు తేటపడతాయి. జలాశయాల్లో మట్టిని తీసి దానితో బొమ్మను చేయడం వల్ల ఆ మట్టిలోని మంచి గుణాలు మన ఒంటికి పడతాయి. ఆ ఒండ్రుమట్టిలో నానడం వలన మన ఒంటికి మంచిదని ప్రకృతి వైద్యులు చెబుతారు. వినాయక విగ్రహాన్ని 11వ రోజున వైభవంగా జల నిమజ్జనం చేయడంలో కూడా ఒక రహస్యం ఉంది అదేంటో ఇక్కడ చూద్దాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.