
Tholi Ekadashi in Telugu
1తొలి ఏకాదశి
తొలి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైన రోజు.ఈ రోజు చాలమంది ఉపవాసము చేయును.ఈ ఉపవాసము బ్రహ్మచర్య,గృహస్త,వానప్రస్త మరియు సన్యాసాశ్రమములోనున్నవారు చాలా మంది ప్రతీ ఏకాదశి ఉపవాసము చేయును. ముఖ్యముగా 3 ఏకదశులు చాల గోప్పవి,
- తొలి ఏకాదశి (ఆషాఢ శుద్ధ ఏకాదశి)
- వైకుంఠ ఏకాదశి (పుష్య శుద్ధ ఏకాదశి) ఉత్తర ద్వార దర్శనము,ఉత్తరాయణ పుణ్యకాలము ఆరంభం
- భీష్మ ఏకాదశి (మాఘ శుద్ధ ఏకాదశి) భీష్మాచార్యులవారు విష్ణు సహస్రనామము స్తుతించినరోజు.
ఇక తొలి ఏకాదశి అంటే శయన ఏకాదశి అని మరియోక నామము గలదు.దానినే ప్రజలందరు ఈ ఏకాదశి వస్తే విష్ణుమూర్తి శయనిస్తాడు అని కుడా అంటారు.దానికి అంతరార్థం ఏమిటంటే ఉత్తరాయణ పుణ్యకాలము సమాప్తి అయ్యే సమయంలో లోకానికి స్థితికారుడైనటువంటి శ్రీమహావిష్ణువు ఆయన కర్మేద్రియములను మూసి(2 కన్నులు) జ్ఞానేద్రియములతో లోకన్ని పాలిస్తాడని ప్రత్రీతి. ఈ సమయములో దక్షిణాయనము ప్రరంభము అవును.అప్పడు స్వర్గద్వారములు ముసివేయును.కనుక ప్రజలు అందరు అత్యంత భక్తి శ్రద్ధలతో మునుపటికంటే ఏక్కువ దైవారాధన చేయవలేను అందుకే మనకు ఉత్తరాయనములో కన్నను దక్షిణాయనములోనే పండుగలు ఏక్కువ.
ఇక తొలి ఏకాదశి నాడు ఉపవాసము చేసినవారికి సార్వాభిష్టఫలములు కలుగునని ఋషులు ఏన్నో పురాణములలో చేప్పియున్నారు.ఉపవాసము అనగా అహారము మానుటకాదు.ఉపవాసము అనగా మంచి పనులు చేయుట అనగా వారి నిత్యకృత్యములు కావు.మంచి పనులు అనగా లోకములో ఉన్న పేద ప్రజలకు దాన,దర్మములు చేయుట,లోకైక నాయకుడిని ఆరాధించుట. ఓకానోకసారి భీమునకు ఉపవాసము చేయాలన్న కోరిక కలిగి శ్రీ కృష్ణభగవానుడిని అడిగెను. అప్పడు సాక్షత్తు శ్రీమహావిష్ణువైనటువంటి శ్రీ కృష్ణ భగవానుడు ఇలా చెప్పెను ఉపవాసనియమములు 4 రకములు,
4 రకములు ఉపవాసనియమములు
- ఓపిక ఉన్నవారు తరువాత రోజు వరకు నిష్ఠగా ఉండి సుర్యోదయమునకు మునుపే నిద్దురలేచి స్నానము దైవారాధన చేసుకుని తరువాత భోజనముచేయవలేను.
- ద్రవపదార్ధములు (నీళ్ళు పాలు మోదలగునవి) స్వీకరిస్తూ తరువాత రోజు సుర్యోదయమునకు మునుపే నిద్దురలేచి స్నానము దైవారాధన చేసుకుని తరువాత భోజనముచేయవలేను.
- ఫలములు స్వీకరిస్తూ తరువాత రోజు సుర్యోదయమునకు మునుపే నిద్దురలేచి స్నానము దైవారాధన చేసుకుని తరువాత భోజనముచేయవలేను.
- ఉండలేనివారు అల్పాహారము స్వీకరించి తరువాత రోజు సుర్యోదయమునకు మునుపే నిద్దురలేచి స్నానము దైవారాధన చేసుకుని తరువాత భోజనముచేయవలేనుదినిలో వారి శారిరిక శక్తిని బట్టి ఏవరు ఏ రకంగా అయిన చేయవచ్చును.
ఉపవాసము ఎందుకు చేయ్యలి?
చాలా మందికి ఉపవాసము ఏందుకు చేయ్యలి అన్న సందేహము కలుగును.ఉపవాసము చేయువారి శారీరిక శక్తి యుక్తులు పేరిగి దీర్ఘకాలము అరోగ్యముతోనుండునని ఏంతో మంది వైద్య నిపుణులు కూడా తెలియజేసారు.మరియు మన శరీరములో ఉన్న జఠరము(digestive system)రోజు పని చేసి అలసిపోవును.కనుక ఓక రోజు దానికి విశ్రంతి ఇచ్చి తరువాత రోజు నుంచి యధాతదంగా ఆహారము స్వీకరించుటవలన ఎక్కువ కాలము ఉదర సంబంధమైన వ్యాధులు దరిచేరవు. ఉపవాసము చేయుటవలన సత్వ,రజస్సు,తామస గుణములు మన ఆదీనములో ఉండును.అవి ఉన్నచో మనిషికి ఇంద్రియ నిగ్రహం కలిగి కామ,క్రోధ, లోభ, మద, మాత్సర్యాలను జయించగలరు.అవి జయిస్తే అతడు సాధించలేనిది ఏదియును లేదని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు భీమునకు పైన చేప్పెన విషయములు అన్నియును బోధించెను.అప్పడు అయన కూడా ఉపవాసము చేసేను.
ఇలా ఏవరైతే ప్రతీ ఏకాదశి నాడు ఉపవాసము చేయునో వారికి అన్ని ఫలములు నెరవేరునని శ్రీ కృష్ణ భగవానుడు చెపెను.
తొలి ఏకదశి 2025 తేది & ముహూర్తం (Toli Ekadashi 2025 Date & Muhurt Time)
2025 జనవరి 9న మధ్యాహ్నం 12:22 గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. జనవరి 10 ఉదయం 10:19 గంటలకు తిథి ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం జనవరి 10న వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి.
వైకుంఠ ఏకాదశి పారణ సమయం:
జనవరి 11న ఉదయం 7:21 నుండి 8:21 వరకు ఉపవాసం విరమించవచ్చు.
…యామిజాల కృష్ణ పవన్ కుమార్
Related Posts
పేరును బట్టి సింహద్వారము ఎలా తేలుసుకోవాలో చేపండి.