
మయూర ధ్వజుని పరోపకారం
పరోపకారం పరమధర్మం అని మనం వింటూనే ఉంటాం. కానీ ‘నేటి జీవన విధానం లో మన అవసరాలు తీరడమే గగనంగా మారుతున్న ఈ కాలం లో పరోపకారం సాధ్యపడుతుందా?’ అనుకునేవారికి మయూరధ్వజుని కథ స్ఫూర్తినిస్తుంది.
1. మయూరధ్వజుడు
ఇది మహాభారత కాలం నాటి కథ. ధర్మరాజు అశ్వమేధ యాగాన్ని చేశాడు. అశ్వమేధ యాగం అంటే ఒక యాగాశ్వాన్ని ప్రపంచమంతా సంచరించడానికి పంపుతారు. ఆ అశ్వం దాటిన ప్రాంతమంతా ఆ యాగం చేసే రాజు జయించినట్లు.
ఎవరైనా వీరులు ఆ అశ్వాన్ని ఆపితే, యాగం చేసే రాజు ఆ వీరునితో యుద్ధం చేసి గెలవాలి. తరువాతే ఆ అశ్వం మరోప్రాంతానికి కదులుతుంది.
లేదా అశ్వమేధయాగం అక్కడితో ఆగిపోతుంది. ధర్మరాజు యాగాశ్వాన్ని మయూరధ్వజుడనే రాజు బంధించాడు. అతను మహా పరాక్రమ శాలి.
విధి గా అర్జునుడు అతని వెంటే శ్రీకృష్ణ భగవానుడు మయూరధ్వజుని ఓడించి యాగాశ్వాన్ని విడిపించుకోవడానికి బయలుదేరారు.
Promoted Content